షిల్లాంగ్ : మేఘాలాయ రాజధాని షిల్లాంగ్లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై ప్రకంపనల తీవ్రత 3.2గా నమోదైంది.
సాయంత్రం 6 గంటల 52 నిమిషాల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనై ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
షిల్లాంగ్కు ఆగ్నేయం దిశలో రెండు కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉందని జాతీయ భూకంప అధ్యాయన కేంద్రం వెల్లడించింది.
భూకంపం లోతు 10 కి.మీ మేర ఉందని తెలిపింది. ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని అధికారులు చెప్పారు.