INDW vs AUSW : ముంబైలోని వాంఖడేలో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా గెలుపొందింది. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో 6 వికెట్ల తేడాతో హర్మన్ప్రీత్ సేనను ఓడించింది. భారత్ నిర్దేశించిన 283 పరుగుల లక్ష్య ఛేదనలో యువకెరటం ఫొబె లిచ్ఫీల్డ్(78), ఎలిసా పెర్రీ(75), ఆల్రౌండర్ తహ్లియా మెక్గ్రాత్(68) హాఫ్ సెంచరీలతో మెరిశారు. దాంతో, ఆసీస్ భారీ టార్గెట్ను 46.3 ఓవర్లలోనే ఛేదించింది. రికార్డుల పరంగా చూస్తే.. మహిళల క్రికెట్లో ఇది రెండో అత్యధిక ఛేదన కావడం విశేషం.
భారీ ఛేదనలో ఆసీస్ తొలి ఓవర్లోనే ఒక వికెట్ కోల్పోయింది. రేణుకా సింగ్ ఓవర్లో ఓపెనర్ హేలీ(0) ఔటయ్యింది. కానీ, ఎలిసా పెర్రీ(11), ఫొబే లిచ్ఫీల్డ్(3) భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి పైచేయి సాధించారు. వీళ్లు రెండో వికెట్కు 148 పరుగులు జోడించి మ్యాచ్ను మలుపు తిప్పారు. అనంతరం బేత్ మూనీ(42)తో కలిసి మెక్గ్రాత్ (68) జట్టును విజయం వైపు నడిపించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
Ellyse Perry, Phoebe Litchfield and Tahlia McGrath hit half centuries as Australia ace their chase in the first ODI #SAvIND
▶️ https://t.co/a3EHOcBNlQ pic.twitter.com/b7EU3s7st0
— ESPNcricinfo (@ESPNcricinfo) December 28, 2023
A late contender for catch of the year pic.twitter.com/WSdIHqw3VA
Sneh Rana 👏 #INDvAUS
— ESPNcricinfo (@ESPNcricinfo) December 28, 2023
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు బాదింది. టాపార్డర్ విఫలమైనప్పటికీ.. మిడిలార్డర్ బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్(82), ఆల్రౌండర్ పూజా వస్త్రాకర్(62 నాటౌట్) అర్ధ శతకాలతో చెలరేగారు. ఓపెనర్ యస్తికా భాటియా(49) కూడా రాణించడంతో భారత్.. ఆసీస్కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కంగారూ బౌలర్లలో అషే గార్డ్నర్, వరేహమ్ తలా రెండు వికెట్లు తీశారు.