Sourashtra Cricket : సౌరాష్ట్రకు చెందిన అండర్ -23 జట్టు క్రికెటర్లు చిక్కుల్లో పడ్డారు. కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ(ColnEl CK Naidu Trophy)లో ఆడుతున్న జట్టు సభ్యులకు చెందిన కిట్స్లో మందు బాటిళ్లతో దొరికారు. వారం క్రితం ఛండీగఢ్ ఎయిర్పోర్టు(Chandigarh Air Port)లో ఐదుగురు ఆటగాళ్ల కిట్స్ను స్కాన్ చేయగా వైన్, విస్కీలతో పాటు బీర్ టిన్స్ లభించాయి. దాంతో, ఆగ్రహించిన ఎస్సీఏ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.
అసలేం జరిగిందంటే..? సౌరాష్ట్ర జట్టు జనవరి 24న ఆతిథ్య ఛండీగఢ్ను చిత్తుగా ఓడించింది. అనంతరం సౌరాష్ట్ర ఆటగాళ్ల కిట్స్ను రాజ్కోట్ చేర్చే బాధ్యతను ఎయిర్లైన్స్కు అప్పగించారు. ఆ మరుసటి రోజు జట్టు సభ్యులు రాజ్కోట్కు వెళ్లారు.
సౌరాష్ట్ర అండర్ -23 జట్టు క్రికెటర్లు
‘ఛండీగఢ్ ఎయిర్పోర్టులో అసలు ఏం జరిగింది? అనేదానిపై మాకు అధికారిక సమాచారం లేదు. అయితే.. కొందరు ఆటగాళ్ల కిట్స్లో మందుబాటిళ్లు దొరకడం మా దృష్టికి వచ్చింది. నిజంగా అది దురదృష్టకరం. అలాంటివాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. సౌరాష్ట్ర క్రికెట్కు చెందిన క్రమశిక్షణ కమిటీ ఆ సంఘటనపై విచారణకు చేపడుతోంది. కమిటీ నివేదిక తర్వాత ఆయా క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అనిసౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ హిమాన్షు షా(Himanshu Shah) తెలిపాడు.