Lionel Messi : అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ పీఎస్జీ(పారిస్ సెయింట్ జర్మనీ) క్లబ్తో ఆఖరి మ్యాచ్ ఆడనున్నాడు. శనివారం రోజు అతను చివరిసారిగా ఆ క్లబ్ జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. ఈ మ్యాచ్లో క్లెర్మంట్ ఫుట్(Clermont Foot) క్లబ్తో పీఎస్జీ తలపడనుంది. ఈ విషయాన్ని పీఎస్జీ హెడ్కోచ్ క్రిస్టోఫే గాల్టియర్(Christophe Galtier) వెల్లడించాడు.
‘ఫుట్బాల్ చరిత్రలో ఒక గొప్ప ఆటగాడికి కోచింగ్ ఇచ్చింనందుకు నాకు చాలా గౌరవంగా ఉంది. పార్క్ డెస్ ప్రిన్సెస్లో మెస్సీకి ఇదే చివరి మ్యాచ్. మ్యాచ్ సందర్భంగా అతడికి ఘన స్వాగతం లభిస్తుందని ఆశిస్తున్నా’ అని గాల్టియర్ తెలిపాడు. ఈ వరల్డ్ కప్ హీరో వచ్చే సీజన్లో సౌదీ అరేబియాకు చెందిన అల్ హిలాల్(Al-Hilal) క్లబ్కు ఆడనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తనకు అల్ హిలాల్ క్లబ్ నుంచి ఆఫర్ వచ్చిందని మెస్సీ రైటర్స్ వార్తా సంస్థతో చెప్పాడు. అయితే.. కాంట్రాక్టు కుదిరిందా? లేదా? అనే విషయం గురించి మెస్సీగానీ, అల్ హయతి క్లబ్గానీ అధికారికంగా వెల్లడించలేదు.
వరల్డ్ కప్ ట్రోఫీ( 2022)ని ముద్దాడుతున్న మెస్సీ
ఫుట్బాల్ లెజెండ్ అయిన మెస్సీ ఏడుసార్లు బాలెన్ డిఓర్ అవార్డ్ గెలిచాడు. అతను 21 ఏళ్ల పాటు బార్సిలోనా() క్లబ్కు ఆడాడు. అయితే.. ఆ క్లబ్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో అతను 2021లో పీఎస్జీతో ఒప్పందం చేసుకున్నాడు. రెండేళ్లు ఈ క్లబ్ తరఫున 21 గోల్స్ కొట్టాడు. మరో 20 గోల్స్ చేయడంలో సహచరులకు సాయం అందించాడు. సూపర్ ఫామ్లో ఉన్న మెస్సీ గత ఏడాది ఖతర్లో అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్ కప్ అందించాడు. ఉత్కంఠ రేపిన ఫైనల్లో 4-2తో షూటౌట్లో ఫ్రాన్స్పై అర్జెంటీనా గెలుపొందింది. దాంతో మూడోసారి చాంపియన్గా అవతరించింది.