Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్లో సంచలన ఆటతో దూసుకెళ్తున్న భారత షట్లర్ లక్ష్య సేన్(Lakshya Sen) సెమీ ఫైనల్లో కంగుతిన్నాడు. రెండో ర్యాంకర్, డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్సెన్ (Viktor Axelsen) చేతిలో అనూహ్యంగా పరాజయం పాలయ్యాడు. దాంతో, విశ్వ క్రీడల్లో తొలి ఫైనల్ ఆడాలనుకున్న లక్ష్య సేన్ కల చెదిరింది.
అయితే.. భారత స్టార్కు పతకం గెలిచేందుకు మరో అవకాశం ఉంది. రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో కాంస్య పతకం కోసం లక్ష్య సేన్ తలపడనున్నాడు. క్వార్టర్స్లో చైనీస్ తైపీ షట్లర్ చో టీన్ చెన్(Chou Tien Chen) ఆటగాడికి షాకిచ్చిన లక్ష్య సేన్ తొలిసారి సెమీస్లో అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్లో ఈ ఘనత సాధించిన మొదటి షట్లర్గా రికార్డు నెలకొల్పాడు.
Commendable efforts against defending champ, we are proud of you Lakshya! 👏
⏯️: 🥉 Medal Match 🆚 Lee Zii Jia 🇲🇾
📸: @badmintonphoto#Paris2024#IndiaAtParis24#Cheer4Bharat#IndiaontheRise#Badminton pic.twitter.com/kirGTkp8kt
— BAI Media (@BAI_Media) August 4, 2024
దాంతో, అతడిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, ఆదివారం జరిగిన సెమీ ఫైనల్లో విక్టర్ ధాటికి లక్ష్యసేన్ నిలువలేకపోయాడు. తొలి సెట్ను 20-22తో కోల్పోయిన భారత స్టార్.. రెండో రౌండ్లో తొలుత ఆధిక్యంలో నిలిచాడు. కానీ, విక్టర్ బలమైన షాట్లతో విరుచుకుపడి 21-14తో సెట్ గెలుపొందాడు. దాంతో, సోమవారం లక్ష్యసేన్ కాంస్యం కోసం మలేషియా షట్లర్ లీ జిల్ జియాను ఢీకొట్టనున్నాడు.