అమరావతి : ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET ) 2024 దరఖాస్తు ప్రక్రియ నిన్నటితో ముగిసింది. రెండు పరీక్షలకు కలిపి 3.20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం గతంలో మాదిరిగా టెట్ పరీక్ష సీబీటీ విధానంలో ఆన్లైన్(Online)లోనే నిర్వహించనున్నది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు సెప్టెంబర్ 19 నుంచి ఆన్లైన్ మాక్ టెస్ట్లు ప్రారంభం కానున్నాయి.
టెట్ హాల్ టికెట్లు(Hall Ticket) సెప్టెంబర్ 22 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని షెడ్యూల్లో పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి ఆన్లైన్ విధానంలో టెట్ పరీక్షలు ప్రారంభమై 20వ తేదీతో ముగుస్తాయి. టెట్ ప్రొవిజినల్ ఆన్సర్ కీ అక్టోబర్ 4న విడుదల, ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ అక్టోబర్ 5 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఫైనల్ ఆన్సర్ కీ అక్టోబర్ 27న విడుదల చేసి, నవంబర్ 2న టెట్ ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది.