నేరేడ్మెట్: ఆల్ ఇండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో లక్ష్మిసాయి ఆరాధ్య రన్నరప్గా నిలిచింది.
బీహార్లో జరిగిన ఈ టోర్నీ అండర్-13 బాలికల సింగిల్స్ ఫైనల్లో ఆరాధ్య 10-21, 10-21తో కర్ణాటకకు చెందిన శైని చేతిలో ఓటమి పాలైంది. హైదరాబాద్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న లక్ష్మి సాయి ఆరాధ్యను అకాడమీ కోచ్ రాజేందర్, నిఖిల్ అభినందించారు.