వెస్టిండీస్తో జరిగిన ఐదో టీ20లో భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. మొత్తం పది వికెట్లను స్పిన్నర్లే తీసి హిస్టరీ క్రియేట్ చేశారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం 12 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు.
దీనిపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కుల్దీప్ ప్రదర్శన సెలెక్టర్లకు తలనొప్పి పెంచుతుందని మంజ్రేకర్ తెలిపాడు. ‘‘అన్ని రెసిపీలూ ట్రై చేసినప్పుడు, అన్నీ సూపర్బ్గా ఉంటే వచ్చే తలనొప్పే ఇది. వాటిలో దేన్ని ఎంపిక చేసుకోవాలనేదే ఇప్పుడు ప్రశ్న. అవకాశం లభించినప్పుడు అశ్విన్ కూడా రాణించాడు.
ఇప్పుడు కుల్దీప్ తన ప్రదర్శనతో మరింత తలనొప్పి తెప్పిస్తున్నాడు’’ అని సంజయ్ చెప్పాడు. కుల్దీప్ అదిరిపోయే పునరాగమనం చేశాడని మెచ్చుకున్న ఈ మాజీ క్రికెటర్.. ‘‘అయినా సరే, టీ20 ప్రపంచకప్ ఆడే 11 మందిలో కుల్దీప్, చాహల్ ఇద్దరినీ ఆడించడం కష్టమనే చెప్తాను. కొంచెం కంట్రోల్ ఉన్న స్పిన్నర్ను ఆడించేందుకు ప్రయత్నిస్తే అశ్విన్, అక్షర్ ఆ స్థానం కోసం పోటీ పడతారు’’ అని వివరించాడు.
జట్టు ఎంపికలో చాహల్ నెంబర్ వన్ స్పిన్నర్ కాగా.. రెండో స్థానంలో దాదాపుగా అక్షర్ పటేల్ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని, వీళ్లిద్దరూ ఫస్ట్ చాయిస్లో ఉంటారని, కావాలంటే మరో ఇద్దరు స్పిన్నర్లను బ్యాకప్ కింద తీసుకోవచ్చని తెలిపాడు. మరి వరల్డ్ కప్ సమయానికి ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.
Back into the side and how 🤩@imkuldeep18 returned with aplomb, helping 🇮🇳 to victory with an economical 3⃣-fer 🙌🏼#WIvIND pic.twitter.com/4Kc9CNAUIS
— Delhi Capitals (@DelhiCapitals) August 8, 2022