IND vs ENG 5th Test : ధర్మశాల టెస్టులో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విజృంభిస్తున్నాడు. స్పిన్కు అనుకూలించిన పిచ్పై ఇంగ్లండ్ టాపార్డర్ను కూల్చని కుల్దీప్.. మిడిలార్డర్ పని పట్టాడు. దాంతో, స్టోక్స్ సేన ఆలౌట్ ప్రమాదంలో పడింది. లంచ్ తర్వాత కూడా తిప్పేసిన కుల్దీప్.. డేంజరస్ జానీ బెయిర్స్టో(29), బెన్ స్టోక్స్(0)లను ఔట్ చేశాడు.
దాంతో, కుల్దీప్ ఐదో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. జో రూట్(26)ను జడేజా వెనక్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన టామ్ హర్ట్లే(6), మార్క్ వుడ్(0)లను ఒకే ఓవర్లో అశ్విన్ పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం బెన్ ఫోక్స్(8), షోయబ్ బషీర్(5) లు ఆడుతున్నారు. టీ సమయానికి ఇంగ్లండ్ స్కోర్.. 194/8.
I. C. Y. M. I!
1⃣ Over
2⃣ Wickets
2⃣ Brilliant Catches
R Ashwin 🤝 Devdutt Padikkal 🤝 Rohit Sharma
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ashwinravi99 | @devdpd07 | @ImRo45 | @IDFCFIRSTBank pic.twitter.com/TDfvYLRDEo
— BCCI (@BCCI) March 7, 2024
టర్నింగ్ పిచ్పై ఇంగ్లండ్ తడబడుతోంది. లంచ్కు ముందే రెండు వికెట్లు తీసిన చైనామన్ బౌలర్ కుల్దీప్ రెండో సెషన్లో ఓపెనర్ జాక్ క్రాలే(79 ) ఔట్ చేశాడు. కుల్దీప్ ఓవర్లో ఫ్రంట్ ఫుట్లో భారీ షాట్ ఆడాలనుకున్న క్రాలే బంతిని మిస్ అయి బౌల్డ్ అయ్యాడు. దాంతో, అసలేం జరిగింది అనుకుంటూ ఓ క్షణం క్రాలే బిత్తరపోయాడు. కుల్దీప్ విజృంభణతో ఇంగ్లండ్ 143 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.