IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్లో చివరి లీగ్ మ్యాచ్..ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని గేమ్లో విరాట్ కోహ్లీ(101 నాటౌట్ : 61బంతుల్లో 13 ఫోర్లు ఒక సిక్స్) శతకంతో మెరిశాడు. వరుసగా రెండో సెంచరీతో ఐపీఎల్లో అత్యధికంగా ఏడు సార్ల వంద కొట్టి క్రిస్ గేల్ రికార్డు బద్ధలు కొట్టాడు. దాంతో, ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో కోహ్లీ ఒంటరి పోరాటం చేశాడు. మైఖేల్ బ్రేస్వెల్(26), అనుజ్ రావత్(21 నాటౌట్) తో కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు.
𝗨𝗡𝗦𝗧𝗢𝗣𝗣𝗔𝗕𝗟𝗘 🫡
Back to Back Hundreds for Virat Kohli in #TATAIPL 2023 👏🏻👏🏻
Take a bow 🙌 #RCBvGT | @imVkohli pic.twitter.com/p1WVOiGhbO
— IndianPremierLeague (@IPL) May 21, 2023
టాస్ ఓడిన ఆర్సీబీకి విరాట్ కోహ్లీ(36), ఫాఫ్ డూప్లెసిస్(28)) శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్కు 67 రన్స్ జోడించారు. రషీద్ ఖాన్ డేంజరస్ గ్లెన్ మ్యాక్స్వెల్(11)ను బౌల్డ్ చేశాడు. మహిపాల్ లొమ్రోర్(1) త్వరగా ఔటయ్యారు. ఆ తర్వాత మైఖేల్ బ్రేస్వెల్(26)తో కలిసి నాలుగో వికెట్కు 47 రన్స్ రాబట్టాడు. బ్రేస్వెల్ తర్వాత వచ్చిన దినేశ్ కార్తిక్(0) డకౌటయ్యాడు. వెంట వెంటనే వికెట్లు పడడంతో ఆర్సీబీ స్కోర్ వేగం తగ్గింది. గుజరాత్ బౌలర్లలో వికెట్లు తీశారు.