Virat Kohli : వెస్టిండీస్ పర్యటన(West Indies Tour)లో ఉన్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) స్వదేశానికి చేరుకున్నాడు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? సాధారణంగా వచ్చే కమర్షియల్ ఫ్లయిట్లో కాకుండా.. తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చార్టర్ ఫ్లయిట్లో విరాట్ స్వదేశానికి చేరుకున్నాడు. ‘గ్లోబల్ ఎయిర్ చార్టర్ సర్వీసెస్’(Global Air Charter Services) వారి ప్రత్యేక విమానంలో కోహ్లీ స్వదేశానికి చేరుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన కోహ్లీ.. ప్రత్యేక ఏర్పాట్లు చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు.
వెస్టిండీస్తో టెస్టు సిరీస్ అనంతరం వన్డే వేదికకు వెళ్లేందుకు భారత జట్టు దాదాపు 8 గంటల పాటు విమానాశ్రయంలో పడిగాపులు పడ్డ వార్తలు బయటకి వచ్చిన నేపథ్యంలో విరాట్ కోసం స్పెషల్ ఫ్లయిట్ అరేంజ్ చేయడం ప్రధాన్యం సంతరించుకుంది. రెండో టెస్టులో శతకం(121)తో చెలరేగిన కోహ్లీకి వన్డేల్లో అవకాశం దక్కలేదు.
విరాట్ కోహ్లీ
మూడు మ్యాచ్లకు సిరీస్కు ఎంపికైనా కూడా యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చింది. తొలి వన్డేలో జట్టులో ఉన్న కోహ్లీ చిన్న టార్గెట్ కావడంతో బ్యాటింగ్కు రాలేదు. ఇక టీ20 సిరీస్కు కోహ్లీతో పాటు రోహిత్ను కూడా ఎంపిక చేయలేదు. వీళ్లిద్దరూ నేరుగా ఆసియా కప్(Asia Cup 2023)లోనే బరిలోకి దిగనున్నారు.