Karun Nair : టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ(Triple Century) అంటే మామూలు విషయం కాదు. అతి కొద్ది మంది క్రికెటర్లకు మాత్రమే సాధ్యమైన ఫీట్. సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), రాహుల్ ద్రవిడ్(Rahul Dravid), వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) లాంటి దిగ్గజాలకు సైతం సాధ్యంకాని ట్రిపుల్ సెంచరీ మార్క్ను కేవలం ఇద్దరే ఇద్దరు భారత క్రికెటర్లు అందుకున్నారు. వారిలో నజాఫ్గఢ్ నవాబ్గా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్ (Virendra Sehwag) తొలిసారి ఈ అద్భుతాన్ని ఆవిష్కరిస్తే.. కర్ణాటక చిన్నోడు కరణ్ నాయర్ (Karun Nair) ఇంగ్లండ్పై టెస్టులో రిపీట్ చేశాడు. రంజీల్లో అద్భుతంగా రాణించిన నాయర్ జట్టులోకి వస్తాడనుకుంటే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఆట నుంచి కనుమరుగయ్యాడు.
దేశవాళీ క్రికెట్(Domestic Cricket)లో 2013-14లో అరంగేట్రం చేసిన కరణ్ నాయర్ (Karun Nair) ఆ ఏడాది ఫైనల్లో 328 పరుగులతో కర్ణాటకను రంజీ ట్రోఫీలో విజేతగా నిలిపాడు. ఆ తర్వాత సీజన్లోనూ నాయర్ రెండు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలతో రాణించాడు. సెలెక్టర్ల దృష్టిలో పడ్డ కరణ్ స్వదేశం వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్కు ఎంపికయ్యాడు. మొహాలీ టెస్టు(Mohli Test)లో అరంగేట్రం చేసిన కరణ్ ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు(303) చేసిన క్రికెటర్గా నిలిచాడు. దీనికి తోడు టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ చేసిన మూడో క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. సెహ్వాగ్ తర్వాత భారత్ తరఫున టెస్టుల్లో త్రిశతకం చేసిన రెండో క్రికెటర్గా కరణ్ నిలిచాడు.
వీరేంద్ర సెహ్వాగ్, కరణ్ నాయర్
పాకిస్థాన్తో ముల్తాన్లో 2004లో జరిగిన మ్యాచ్లో సెహ్వాగ్ 309 పరుగులతో కొత్త చరిత్ర లిఖించాడు. పాక్ బౌలర్లకు పట్టపగలు చుక్కలు చూపిస్తూ ‘ముల్తాన్ కా సుల్తాన్’(Multan KaaSultan) అనిపించుకున్నాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాపై 2008లో సెహ్వాగ్ మరోమారు 319 పరుగులు చేశాడు. అయితే ట్రిపుల్ సెంచరీని మరో భారత ఆటగాడు మళ్లీ పునరావృతం చేసేందుకు చాలా ఏండ్లు పట్టింది. ఇలా లెక్కకు మిక్కిలి రికార్డులు సొంతం చేసుకున్న కరణ్ ఎంత వేగంగా పరుగులు సాధించాడో అదే రీతిలో జట్టుకు దూరమయ్యాడు. సీనియర్ల రాకతో స్థానంలో కోల్పోయిన కరణ్ తిరిగి జట్టులోకి రాలేకపోయాడు.
కేఎల్ రాహుల్ స్థానంలో ఎంపికైన నాయర్