IND vs WI : భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్కు తెర లేచింది. బ్రియాన్ లారా స్టేడియంలో జరుగుతున్న మొదటి టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ రొవ్మన్ పావెల్(Rovman Powell) బ్యాటింగ్ తీసుకున్నాడు. టీ20ల్లో టీమిండియాకు ఇది 200వ మ్యాచ్ కావడం విశేషం. ఈమ్యాచ్తో తిలక్ వర్మ(Tilak Varma), పేసర్ ముకేశ్ కుమార్(Mukesh Kumar) టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్ సొంతం చేసుకున్న భారత జట్టు హ్యాట్రిక్ సిరీస్పై గురి పెట్టింది. మరికాసేపట్లో మ్యాచ్ మొదల్వనుంది.
భారత జట్టు : ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమర్.
తిలక్ వర్మ, ముకేశ్ కుమర్
వెస్టిండీస్ జట్టు : కైలీ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సస్ చార్లెస్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మైర్, రొవ్మన్ పావెల్(కెప్టెన్), జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకీల హొసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్.