అహ్మాదాబాద్: ఇండియా త్వరత్వరగా రెండు వికెట్లు కోల్పోయింది. విండీస్తో జరుగుతున్న రెండవ వన్డేలో పంత్, కోహ్లీలు స్వల్ప తేడాలో ఔటయ్యారు. 15 ఓవర్లలో ఇండియా 47 రన్స్ చేసి మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ 5 రన్స్ చేసి ఔట్ అవ్వగా.. ఓపెనర్గా వచ్చిన పంత్ 18 రన్స్ చేశాడు. ఇక కోహ్లీ కూడా 18 రన్స్కే నిష్క్రమించాడు. టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత ఇండియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ప్రస్తుతం క్రీజ్లో సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ ఉన్నారు.