KL Rahul | జింబాబ్వేతో జరిగే మూడు వన్డేల సిరీస్కు సీనియర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ సారధ్యం వహించనున్నారు. కేఎల్ రాహుల్ ఫిట్గానే ఉన్నాడని బీసీసీఐ మెడికల్ టీం ధృవీకరించడంతో టీం ఇండియాకు కేఎల్ రాహుల్ సారధ్యం వహిస్తారని బీసీసీఐ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు టీం ఇండియా వరుస సిరీస్లతో బిజీబిజీగా ఉన్నా.. కేఎల్ రాహుల్ ఆ సిరీస్లకు దూరంగా ఉన్నాడు.
ఇంతకుముందు కేఎల్ రాహుల్ లేకుండానే జింబాబ్వే సిరీస్కు టీం ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. శిఖార్ ధావన్ను టీం ఇండియా కెప్టెన్గా ప్రకటించింది. కానీ, కేఎల్ రాహుల్ ఫిట్నెస్ పరీక్షలో క్వాలిఫై కావడంతో జింబాబ్వే సిరీస్లో చోటు కల్పించామని తెలిపింది. ఈ నెల 18న తొలి వన్డే, 20న రెండో, 22న మూడో వన్డే జరుగనున్నది. త్వరలో ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేఎల్ రాహుల్ ఫామ్లోకి రావడం గమనార్హం.
టీం ఇండియా టీం: కెప్టెన్ కేఎల్ రాహుల్, వైస్ కెప్టెన్ శిఖార్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శ్యామ్సన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర పటేల్, అవేశ్ ఖాన్, ప్రసీద కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.