అడిలైడ్: బంగ్లాదేశ్తో జరుగుతున్న టీ20 వరల్డ్కప్ మ్యాచ్లో ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 50 రన్స్ చేసి క్యాచ్ ఔటయ్యాడు. ఇండియా తొలి 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 86 రన్స్ చేసింది. కోహ్లీ 24, సూర్య ఏడు రన్స్తో క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. అయితే ఫామ్లో లేని రాహుల్ ఈ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 50 రన్స్ చేశాడు.