ముంబై: న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్కు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను కేఎల్ రాహుల్ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం టీ20 వరల్డ్కప్లో ఇండియా జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ కప్ తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనుకున్నట్లు విరాట్ గతంలో తెలిపాడు.
ప్రస్తుతం కేఎల్ రాహుల్ టీ20 ఫార్మాట్లో ఫామ్లో ఉన్నాడు. నిజానికి వరల్డ్కప్లో ఇండియా రెండు మ్యాచ్లు ఓడినా.. ఆ తర్వాత జరిగే కివీస్ సిరీస్పై కూడా దృష్టి పెట్టింది. న్యూజిలాండ్తో జరిగే టీ20, టెస్ట్ సిరీస్కు .. స్టేడియాలకు అభిమానుల్ని కూడా అనుమతి ఇవ్వనున్నట్లు ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. బయోబబుల్ వాతావరణం వల్ల కూడా ఆటగాళ్లు కొంత మానసిక వత్తిళ్లకు లోనవుతున్నట్లు బౌలర్ జెస్ప్రీత్ బుమ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో కొందరు ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వనున్నారు. నవంబర్ 17వ తేదీ నుంచి కివీస్తో టీ20 సిరీస్ ప్రారంభంకానున్నది. జైపూర్, రాంచీ, కోల్కతాలో టీ20 మ్యాచ్లు ఉంటాయి. ఆ తర్వాత కాన్పూర్, ముంబైల్లో టెస్ట్ మ్యాచ్లు ఆడనున్నారు.