లక్నో: ఐపీఎల్లో జరిమానాల పరంపర కొనసాగుతున్నది. స్లో ఓవర్రేట్కు పాల్పడినందుకు లక్నో, చెన్నై కెప్టెన్లు కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్పై చెరో రూ.12 లక్షల జరిమానా పడింది. శుక్రవారం అటల్ బిహారీ వాజపేయి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే తక్కువ వేసిన కారణంగా ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వహకులు పేర్కొన్నారు. ఈ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నైపై లక్నో అద్భుత విజయం సాధించింది.