కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. ఆరంభంలో వికెట్లు కోల్పోయినా పంజాబ్ ఆటతీరు చూస్తే భారీ స్కోరు చేస్తుందని అభిమానులు బావించారు. కానీ ఉమేష్ యాదవ్, సౌతీ, రస్సెల్ సహా కోల్కతా బౌలర్లంతా సమిష్టిగా రాణించడంతో పంజాబ్ బ్యాటర్లు చేతులెత్తేశారు.
తొలి ఓవర్లోనే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (1) వికెట్ కోల్పోయిన పంజాబ్.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే రెండు బౌండరీలు బాది పెవిలియన్ చేరాలన్నట్లు ఆడారు. దీంతో రాజపక్స (31), ధావన్ (16), లియామ్ లివింగ్స్టన్ (19), రాజ్ బవా (11), షారుఖ్ ఖాన్ (0), హర్ప్రీత్ బ్రార్ (14), ఒడియన్ స్మిత్ (9), రాహుల్ చాహర్ (0), కగిసో రబాడ (25), అర్షదీప్ సింగ్ (0) పరుగులు మాత్రమే చేయగలిగారు.
రాజపక్స తర్వాత రబాడ టాప్ స్కోరర్ అంటేనే వారి బ్యాటింగ్ ఏ రకంగా సాగిందో ఊహించుకోవచ్చు. దీంతో 18.2 ఓవర్లలోనే పంజాబ్ జట్టు ఆలౌట్ అయిపోయింది. 137 ఓవర్లకు చాపచుట్టేసింది. కోల్కతా బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4, టిమ్ సౌతీ 2, వికెట్లు తీయగా.. శివమ్ మావి, సునీల్ నరైన్, రస్సెల్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
We couldn't have asked for more! Onto our batters now 👊#KKRHaiTaiyaar #KKRvPBKS #IPL2022 pic.twitter.com/c2Zlbfyx9b
— KolkataKnightRiders (@KKRiders) April 1, 2022