న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్కతా నైట్రైడర్స్ మరో ప్లేయర్ కరోనా బారినపడ్డాడు. కేకేఆర్, టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యాడు. దీంతో కేకేఆర్ జట్టులో కరోనా సోకిన ఆటగాళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, న్యూజిలాండ్ ప్లేయర్ టిమ్ సీఫెర్ట్ కరోనా బారినపడ్డారు. కాగా, ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్, ఇంగ్లండ్తో జరిగే ఐదు టెస్టుల సిరీస్కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రిజర్వ్ ఆటగాడిగా ప్రసిద్ద్ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా కారణంగా ఐపీఎల్ 14వ ఎడిషన్ అర్ధంతరంగా వాయిదా పడింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి