WPL 2024 : మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్కు కౌంట్డౌన్ మొదలైంది. టోర్నీ మొదలవ్వడానికి ఇంకా మూడు రోజులే ఉంది. దాంతో, రెండో సీజన్ ఆరంభ వేడుకల్ని(Opening Ceremony) ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఓపెనింగ్ సెరమొనీలో బాలీవుడ్ స్టార్ హీరోలతో ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది. కుర్ర హీరో కార్తిక్ ఆర్యన్(Karthik Aryan)తో పాటు షేర్షా ఫేమ్ సిద్దార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra)లు స్టేజ్ మీదప్రత్యేక ప్రదర్శన ఇస్తారని డబ్ల్యూపీఎల్ ఎక్స్ ఖతాలో ఓ పోస్ట్ పెట్టింది.
‘ఇది కింగ్డమ్ కాదు. క్వీన్డమ్. కార్తిక్ ఆర్యన్, సిద్దార్థ్ మల్హోత్రాలు తమ క్వీన్డమ్ కిరీటం కోసం ఫైట్ చేయనున్నారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగే టాటా ఐపీఎల్ ఓపెనింగ్ సెరమొనీని జియోసినిమా, స్పోర్ట్స్ 18 ఛానెళ్లలో లైవ్ చూడండి’ అని ఆ పోస్ట్లో రాసుకొచ్చింది.
నిరుడు తొలి సీజన్ ఆరంభ వేడుకలో బాలీవుడ్ హీరోయిన్లు కియరా అడ్వానీ, కృతి సనన్, సింగర్ ఏపీ థిల్లాన్లు తమ ప్రదర్శనతో ముంబై స్టేడియాన్ని హోరెత్తించిన విషయం తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఫిబ్రవరి 23న డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఆరంభం కానుంది. సాయంత్రం 6ః30 గంటలకు ఓపెనింగ్ సెరమొనీని నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్లో నిరుడు విజేత ముంబై ఇండియన్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.
మార్చి 15న ఎలిమినేటర్ పోరు.. మార్చి 17న ఫైనల్ నిర్వహించనున్నారు. తొలి సీజన్లో ముంబైకే పరిమితమైన డబ్ల్యూపీఎల్.. రెండో సీజన్లో రెండు నగరాల్లో జరుగనుంది. ఐదు జట్లు బెంగళూరు, ఢిల్లీ వేదికగా 22మ్యాచ్లు ఆడనున్నాయి. అత్యధికంగా బెంగళూరులో 11 మ్యాచ్లు నిర్వహించనున్నారు. మార్చి 4 తర్వాత టోర్నీ మొత్తానికి ఢీల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది.