BCCI Central Contracts | దేశవాళీలు ఆడమని చెప్పినా వినకుండా వాటిని స్కిప్ చేసిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి పక్కనబెట్టిన నిర్ణయంపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది బీసీసీఐ మంచి నిర్ణయం తీసుకున్నదని, దీనివల్ల దేశవాళీ క్రికెట్కు మేలు జరుగుతుందని చెబుతుండగా మరికొంతమంది మాత్రం ఒకరిద్దరు ప్లేయర్లను బలితీసుకోవడం మంచిదికాదని అంటున్నారు. తాజాగా ఈ వివాదంపై భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించాడు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొంతమంది ప్లేయర్లకు బాధ ఉంటే ఉంటుంది గానీ దీని వల్ల డొమెస్టిక్ క్రికెట్కు మంచే జరుగుతుందని 1983 వరల్డ్ కప్ విన్నర్ అన్నాడు.
ఇదే విషయమై పీటీఐతో ముచ్చటించిన కపిల్.. అవును. ఈ డిసీషన్ వల్ల కొంతమంది ప్లేయర్లు బాధ పడతారు. కానీ దేశం కంటే ఎవరూ గొప్ప కాదు కదా. బోర్డు మంచి నిర్ణయం తీసుకుంది. ఇందుకు గాను బీసీసీఐకి కృతజ్ఞతలు. దేశవాళీ క్రికెట్ను కాపాడటానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదం చేస్తుంది..’ అని అన్నాడు. కపిల్ దేవ్ దేశవాళీలో సుమారు 500 మ్యాచ్లు ఆడాడు.
VIDEO | Here’s what veteran cricketer Kapil Dev said on #BCCI‘s decision to drop Ishan Kishan and Shreyas Iyer from central contract.
“I am so happy that the cricket board has taken a step forward for first-class cricket. The boys must play that, it’s good for the country.… pic.twitter.com/64SZGeyCYn
— Press Trust of India (@PTI_News) March 1, 2024
భారత క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిన తర్వాత దేశవాళీలను పట్టించుకోవడం లేదని కపిల్ దేవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు తమ రాష్ట్రాల తరఫున ఆడటానికి గౌరవంగా భావించాలని, తద్వారా దేశవాళీలో ఆడే యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలవాలని కపిల్ సూచించాడు. అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడికి వెళ్లినా అందుకు సంబంధించిన మూలాలు మాత్రం డొమెస్టిక్ క్రికెట్లోనే ఉన్నాయన్న విషయాన్ని మరిచిపోవద్దని కపిల్ సూచించాడు.