భారత క్రికెట్లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఎంతటి కీలకమైన ఆటగాళ్లో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ముగ్గురూ కూడా వారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి చాలా కాలమే అయింది. ముఖ్యంగా గత టీ20 ప్రపంచకప్లో వీళ్లు సరిగా రాణించకపోవడం వల్లనే భారత జట్టు కనీసం సెమీస్ కూడా చేరలేదు. దీనిపై మాజీ దిగ్గజం కపిల్ దేవ్ స్పందించాడు.
‘‘పెద్ద ఆటగాల్లు అంటే.. వారి బాధ్యత కూడా అంతే ఉంటుంది. మ్యాచ్పై అంతటి ఇంపాక్ట్ చూపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ వీళ్లు ముఖ్యమైన సమయంలో అవుటైపోతారు’’ అని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా 150-160 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేయగలరన్న కపిల్ దేవ్.. ఒక 10-12 బంతుల వరకు పిచ్కు అలవాటు పడి, ఆ తర్వాత భారీ షాట్లు ఆడాలని వీళ్ల నుంచి ఆశిస్తామని అన్నాడు. కానీ వీళ్లు ఒక 25 బంతులు ఆడి పెవిలియన్కు వచ్చేస్తే ఫలితం ఏముంటుందని విమర్శించాడు.
‘‘తను యాంకర్ పాత్ర పోషించాలా? లేక భారీ షాట్లు ఆడాలా? అనే నిర్ణయం సదరు ఆటగాడు లేదా జట్టు తీసుకోవాలి. ఉదాహరణకు కేఎల్ రాహుల్ గనుక 20 ఓవర్లపాటు క్రీజులో ఉండి 80-90 పరుగులు చేస్తే ఓకే. కానీ అంతసేపు క్రీజులో ఉండి 60 నాటౌట్గా నిలిచాడనుకో ఉపయోగం ఏముంది?’’ అని కపిల్ ప్రశ్నించాడు. అది జట్టుకు న్యాయం చేసినట్లు కాదని తేల్చిచేప్పాడు.