జైపూర్: ఇండియాతో జరిగే మూడు మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్కు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ఆదేశ క్రికెట్ బోర్డు తెలిపింది. బుధవారం జైపూర్లో తొలి టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. కివీస్ జట్టుకు టీ20 కెప్టెన్గా టిమ్ సౌథీ వ్యవహరించనున్నాడు. నవంబర్ 25 నుంచి కాన్పూర్లో జరగనున్న టెస్టు సిరీస్ కోసం కేన్ విలియమ్సన్ ప్రిపేరవుతున్నాడని, దాని కోసమే టీ20 మ్యాచ్లకు విలియమ్సన్ దూరం అవుతున్నట్లు కివీస్ బోర్డు తెలిపింది. న్యూజిలాండ్ ఆటగాళ్లు కైల్ జేమిసన్, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్లు రెండు సిరీస్లకు అందబాటులో ఉండనున్నారు. శుక్రవారం రెండవ టీ20 మ్యాచ్ రాంచీలో, ఇక మూడవ మ్యాచ్ కోల్కతాలో ఆదివారం జరగనున్నాయి.
కివీస్ టీ20 జట్టు…
టాడ్ ఆస్టిల్, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మాన్, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్తిల్, కేల్ జేమీసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెర్ట్, ఇషా సోదీ, టిమ్ సౌథీ.