భారత్తో ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడే న్యూజిలాండ్ జట్టును మంగళవారం విడుదల చేశారు. 15 మందితో కూడిన జట్టును కివీస్ ప్రకటించింది. సౌతాంప్టన్లోని ఏజీస్ బౌల్ మైదానంలో జూన్ 18 నుంచి ఫైనల్ జరగనుంది. ఇటీవల ఇంగ్లాండ్తో ముగిసిన టెస్టు సిరీస్లో రెండో టెస్టుకు ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమైన విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న కేన్ మళ్లీ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
వికెట్ కీపర్ బీజే వాట్లింగ్ ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండనున్నాడు. కోలిన్ డీ గ్రాండ్హోమ్ను స్పెషలిస్ట్ ఆల్రౌండర్గా చేర్చుకున్నారు. అజాజ్ పటేల్ను స్పెషలిస్ట్ స్పిన్నర్గా తీసుకున్నారు.సౌతాంప్టన్ వేదికగా భారత క్రికెట్ జట్టుతో తలపడేందుకు మా ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టీడ్ పేర్కొన్నాడు.
కివీస్ టీమ్:
కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, డేవాన్ కాన్వే, కోలిన్ గ్రాండ్హోమ్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, బీజే వాట్లింగ్, విల్ యంగ్