రేపటి నుంచి పోటీలు ప్రారంభం
నయీంనగర్, మార్చి 15 : సౌత్జోన్ మహిళల ఖోఖో టోర్నీకి కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) ఆతిథ్యమిస్తుందని వైస్చాన్స్లర్ తాటికొండ రమేశ్ తెలిపారు. ఈనెల 17 నుంచి 20 వరకు జరుగనున్న టోర్నీకి సంబంధించిన పోస్టర్ను మంగళవారం సెనెట్ హాల్లో ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వీసీ రమేశ్ మాట్లాడుతూ ఐదేండ్ల విరామం తర్వాత జరిగే పోటీల్లో ఆతిథ్య తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి నుంచి 67 జట్లు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. టోర్నీ కోసం ఆరు మైదానాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. వివిధ వర్సిటీల నుంచి వచ్చే ప్లేయర్ల కోసం క్యాంపస్లో ఏర్పాట్లు చేశామని వివరించారు.