ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ యువ అథ్లెట్, గతేడాది హాంగ్జౌ (చైనా) వేదికగా ముగిసిన వంద మీటర్ల హర్డిల్స్ విభాగంలో రజత పతకం గెలిచిన జ్యోతి యర్రాజీ విదేశీ శిక్షణకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆర్థిక సాయం చేయనుంది. పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో ఆమె స్పెయిన్లోని టెనెరైఫ్లో 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ పొందేందుకు గాను సాయాన్ని కోరింది.
క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టార్గెట్ ఒలింపిక్ పోడియమ్ స్కీమ్ (టాప్స్) నిధుల నుంచి జ్యోతికి విమాన ఖర్చులు, వీసా అప్లికేషన్ ఫీజులతో ఇతరత్రా ఖర్చులను టాప్స్ భరించనుంది. ఈ మేరకు మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) ఆర్థిక సాయానికి ఆమోదం తెలిపింది.