నాటింగ్హామ్: మాజీ కెప్టెన్ జో రూట్ (163 బ్యాటింగ్), ఓలీ పోప్ (145) భారీ సెంచరీలతో చెలరేగడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ దీటుగా బదులిస్తున్నది. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. ఓవర్నైట్ స్కోరు 90/1తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టాడు. చేతిలో 5 వికెట్లు ఉన్న ఇంగ్లండ్.. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 80 పరుగులు వెనుకబడి ఉంది.