మరికొన్ని రోజుల్లో మొదలయ్యే టీ20 ప్రపంచకప్ ముందు భారత్కు గట్టి షాక్ తగిలింది. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇంగ్లండ్ పర్యటన తర్వాత జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా.. వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్, జింబాబ్వే పర్యటనల్లో అతనికి విశ్రాంతినిచ్చారు.
ఆ తర్వాత ఆసియా కప్లో కూడా బుమ్రా ఆడలేదు. తాజాగా ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్లో చివరి రెండు మ్యాచుల్లో బుమ్రా ఆడాడు. తర్వాత మొదలైన సౌతాఫ్రికా సిరిస్ తొలి మ్యాచ్ ముందు మరోసారి వెన్నునొప్పి అతన్ని బాధించింది. దీంతో జట్టుకు దూరమయ్యాడు.
అయితే ప్రపంచకప్ నాటికి బుమ్రా కోలుకుంటాడని, భారత జట్టు బౌలింగ్ బలహీనతను అధిగమిస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ అలా జరగలేదు. బుమ్రా పరిస్థితిని పూర్తిగా పరిశీలించిన అనంతరం అతను పొట్టి ప్రపంచకప్ ఆడలేడని తేల్చామని బీసీసీఐ ప్రకటించింది. త్వరలోనే బుమ్రా స్తానంలో మరొకరిని ఎంపిక చేస్తామని తెలిపింది. ఈ వార్త విన్న ఫ్యాన్స్ షాకైపోయారు.
NEWS – Jasprit Bumrah ruled out of ICC Men’s T20 World Cup 2022.
More details here – https://t.co/H1Stfs3YuE #TeamIndia
— BCCI (@BCCI) October 3, 2022