Jasprit Bumrah : ఐపీఎల్ 2024 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)ను తిరిగి సొంతం చేసుకుంది. దాంతో, రోహిత్ శర్మ(Rohit Sharma) తర్వాత ముంబై భావి కెప్టెన్గా పాండ్యాను నియమించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ముంబై నిర్ణయం పలు జట్లను ఒకింత షాక్కు గురిచేసింది. ఈ నేపథ్యంలో భారత స్పీడ్స్టర్, ముంబై సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
‘కొన్నిసార్లు నిశ్శబ్దమే ఉత్తమ సమాధానం’ అని ఇంగ్లీష్లో రాసుకున్న కోట్ను బుమ్రా పోస్ట్ చేశాడు. అది చూసిన ఫ్యాన్స్ బుమ్రాకు మద్దుతుగా కామెంట్లు పెడుతున్నారు. రోహిత్ తర్వాత బుమ్రాను ముంబై కెప్టెన్ చేస్తారని మాటిచ్చారు. కానీ, ఇప్పుడు ఊహించనివిధంగా హార్దిక్ పాండ్యా జట్టులోకి వచ్చాడు అని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరు బుమ్రా గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీకి మారుతాడా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
హార్దిక్ పాండ్యా, బుమ్రా
నిరుడు టీ20 వరల్డ్ కప్ ముందు గాయపడిన బుమ్రా 2023లో పలు కీలక టోర్నీలకు దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రాటుదేలిన బుమ్రా ఐర్లాండ్ సిరీస్తో రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత శ్రీలంక, పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చిన ఆసియా కప్లో ఈ యార్కర్ కింగ్ అదరగొట్టాడు. వన్డే ప్రపంచ కప్లో షమీతో పాటు భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే.. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్కు బీసీసీఐ బుమ్రాతో పాటు షమీకి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.