వరంగల్ : వరంగల్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని వరంగల్ తూర్పు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్(MLA Nannapaneni Narender) అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అడగకముందే ఎన్నో నిధులు కేటాయించారన్నారు. ఎంతో మందికి ఉపాధి కల్పించే మెగా టెక్స్టైల్స్ పార్కును నిర్మించారు. విద్య, వైద్యానికి ఎంతో ప్రాధాన్యమిచ్చారని పేర్కొన్నారు. కాగా, భవిష్యత్లో నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించాలని కోరారు. మహిళలకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి. అలాగే కాకతీయల వైభవాన్ని చాటి చెప్పేలా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.