మహబూబ్ నగర్, నవంబర్ 28 : ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటే వజ్రాయుధం. ఓటు విలువను గుర్తించిన ఓ యువకుడు తన ఓటు(Vote) హక్కును వినియోగించుకునేందుకు అమెరికా నుంచి వచ్చాడు. వివరాల్లోకి వెళ్తే..మహబూబ్నగర్కు చెందిన యువకుడు బి. భరత్ కుమార్ అమెరికా(America)లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎలాగైనా ఓటు హక్కు వినియోగించుకోవాలని భరత్ అమెరికా నుంచి ఇండియాకు చేరుకున్నారు.
మహబూబ్నగర్లో జరిగిన అభివృద్ధిని చూసి ఆశ్చర్యపడిన యువకుడు..మహబూబ్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud)ని కలిసి పట్టణ అభివృద్ధిపై సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇంకా చాలా అభివృద్ధి జరగనుందని మంత్రి తెలిపారు. అమెరికా నుంచి ఓటు వేసేందుకే ఇంత దూరం వచ్చినందుకు యువకుడిని మంత్రి అభినందించారు. ప్రజల తలారాతను మార్చే ఓటును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు.