Yashasvi Jaiswal : స్వదేశంలో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లండ్కు కొరకరాని కొయ్యలా మారిన భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) మరో ఘనత సాధించాడు. రాంచీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో 37 పరుగులు చేసిన ఈ యంగ్స్టర్ ఇంగ్లండ్పై ఒకే సిరీస్లో అత్యధిక పరుగలు చేసిన రెండో భారత బ్యాటర్గా అవతరించాడు. తద్వారా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డును యశస్వీ సమం చేశాడు. కోహ్లీ 2016లో ఇంగ్లండ్ సిరీస్లో 655 పరుగులతో రికార్డు సృష్టించాడు.
ప్రస్తుతం యశస్వీ, కోహ్లీ.. ఇద్దరూ 655 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. సిరీస్లో మరో టెస్టు మిగిలి ఉండడంతో యశస్వీ.. విరాట్ను వెనక్కి నెట్టే చాన్స్ లేకపోలేదు. ఇంగ్లండ్పై ఒకే సిరీస్లో అత్యధిక రన్స్ కొట్టిన వాళ్లలోరాహుల్ ద్రవిడ్ 602 పరుగులతో మూడో స్థానంలో నిలవగా.. మంజ్రేకర్ 586 రన్స్తో నాలుగో స్థానంలో ఉన్నాడు.
రంజీ ట్రోఫీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిలో పడ్డ యశస్వీ నిరుడు టీమిండియా జెర్సీ వేసుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన యశస్వీ.. ఏడు ఇన్నింగ్స్ల్లోనే 103 సగటుతో 618 రన్స్ కొట్టాడు. కెరీర్ మొదలెట్టిన కొన్ని రోజుల్లోనే ఈ యంగ్స్టర్ 2 సెంచరీలు, రెండు ఫిఫ్టీలు సాధించి భారత భావితారగా ప్రశంసలు అందుకుంటున్నాడు. బలమైన ఫుట్వర్క్, షాట్ సెలెక్షన్లో కచ్చితత్వం, అలవోకగా బౌండరీలు, సిక్సర్లు బాదగల నైపుణ్యం కలిగిన యశస్వీ భారత క్రికెట్కు తరగని ఆస్తిలా మారుతున్నాడు.