నాగపూర్: స్పిన్నర్ రవీంద్ర జడేజాకు .. జరిమానా విధించింది ఐసీసీ. నాగపూర్ టెస్టులో ఇండియన్ ఆల్రౌండర్ ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిని ఉల్లంగించాడు. దీంతో అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళికి చెందిన ఆర్టికల్ 2.20ను జడేజా అతిక్రమించినట్లు తేలింది. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమని ఐసీసీ వెల్లడించింది.
🚨 JUST IN: India star handed penalty for ICC Code of Conduct charge during first Test against Australia!#WTC23 | #INDvAUS | Details 👇
— ICC (@ICC) February 11, 2023
క్రమశిక్షణా చర్యల కింద జడేజాకు జరిమానాతో పాటు ఒక పాయింట్ను డీమెరిట్ చేశారు. గడిచిన 24 నెలల కాలంలో జడేజాకు ఇది తొలి తప్పిదం అవుతుంది. ఫిబ్రవరి 9వ తేదీన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో.. 46వ ఓవర్లో జడేజా తన ఇండెక్స్ ఫింగర్కు సూత్నింగ్ క్రీమ్ను అప్లై చేశాడు. సిరాజ్ నుంచి క్రీమ్ తీసుకున్న అతను ఎడమ చేతి చూపుడువేలికి రుద్దాడు.
ఇండెక్స్ ఫింగర్కు వాపు రావడం వల్ల జడేజా క్రీమ్ రద్దుకున్నట్లు టీమ్ మేనేజ్మెంట్ వివరణ ఇచ్చింది. అయితే ఆన్ ఫీల్డ్ అంపైర్ల పర్మిషన్ లేకుండా అలా చేసినందుకు అతనిపై చర్యలు తీసుకున్నారు. .ఈ తప్పును జడేజా అంగీకరించాడు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ ఆండీ పైక్రాఫ్ట్ ఈ శిక్షను ఖరారు చేశారు. లెవల్ వన్ ఉల్లంఘన కింద జడేజాకు మ్యాచ్ ఫీజులో కోత విధించారు.