Euro Qulaifier 2024 : యూరోపియన్ చాంపియన్షిప్ 2024 క్వాలిఫయర్స్లో ఇజ్రాయేల్(Israel) ఫుట్బాల్ జట్టు అనూహ్యంగా ఓడిపోయింది. ఆదివారం జరిగిన పోరులో పసికూన కొసోవో(Kosovo) చేతిలో 0-1తో పరాజయం పాలైంది. ఈ ఓటమితో ఇజ్రాయేల్ వచ్చే ఏడాది జర్మనీలో జరిగే యూరోపియన్ చాంపియన్షిప్(Euro Championship) ఫైనల్స్కు చేరే అవకాశాలు సన్నగిల్లాయి.
షెడ్యూల్ ప్రకారం ఇజ్రాయేల్ – కొసోవో మ్యాచ్ అక్టోబర్ 15న జరగాల్సింది. కానీ, అక్టోబర్ 7 నుంచి హమాస్ దళాలు, ఇజ్రాయేల్ సైన్యం గాజాలో పరస్పర దాడులకు పాల్పడ్డాయి. దాంతో, నిర్వాహకులు మ్యాచ్ను వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు నవంబర్ 12 ఆదివారం పాలస్తీనాలో మ్యాచ్ జరిగింది.
ఆరంభంలో ఇరుజట్ల ఆటగాళ్లు గోల్ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కొసోవో ప్లేయర్ మిలొట్ రచియా 41వ నిమిషంలో మెరుపు గోల్ చేశాడు. ఆ తర్వాత ఇజ్రాయేల్ ఆటగాళ్లు కొసోవో గోల్పోస్ట్పై దాడి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో, ఇజ్రాయేల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రొమేనియా కంటే 5 పాయింట్లు వెనకబడి ఉంది. ఈ టోర్నీలో టాప్ -2లో నిలిచిన జట్లు నేరుగా యూరో 2024 పోటీలకు అర్హత సాధిస్తాయి.