Asia Cup | ఆసియా కప్లో దాయాదుల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా బాధ్యతాయుతమైన బ్యాటింగ్తో జట్టు పరిస్థితి మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. 29వ ఓవర్లో ఇషాన్ కిషాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షాదాబ్ ఖాన్ వేసిన 29వ ఓవర్ రెండో బంతికి సింగిల్ తీయడంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 54 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో 29 ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. క్రీజ్లో ఇషాన్ కిషాన్ 55, హార్దిక్ పాండ్యా 37 పరుగులతో కొనసాగుతున్నారు.
అంతకుముందు 28 ఓవర్లు ముగిసే సమయానికి ఇషాన్ కిషాన్ 49 పరుగులు, హార్దిక్ పాండ్యా 36 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. టీం ఇండియా 140 పరుగులు చేసింది. అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతోపాటు నలుగురు బ్యాటర్లు ఔటైనా ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా నిలకడగా ఆడుతూ స్కోర్ పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.