హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): చైనాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ బిడ్డ ఇషాసింగ్ బృందం స్వర్ణ పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తం చేశారు. ఇషాసింగ్ తెలంగాణకు గర్వకారణమన్నారు. ఇషాసింగ్ బృందం 1759 పాయింట్లతో భారత్కు స్వర్ణ పతకం సాధించి..సత్తా చాటిందని సీఎం అన్నారు. వ్యక్తిగత ఈవెంట్లోనూ రజతం సాధించడం ఆమె ప్రతిభకు నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అమలు చేస్తున్న పటిష్ఠ కార్యాచరణే జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికల్లో తెలంగాణ క్రీడాకారులు కనబరుస్తున్న ప్రతిభకు నిదర్శనమని ఆయన అన్నారు.రానున్న రోజుల్లో రాష్ట్ర ప్లేయర్లు మరెన్నో పతకాలు సాధించి, మన ఖ్యాతిని ఇనుమడింపజేయాలని సీఎం ఆకాంక్షించారు. మరోవైపు యువ షూటర్ ఇషాసింగ్ను క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అభినందించారు. భవిష్యత్లో ఇషా మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు