Irfan Pathan : ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఫైనల్కు దూసుకెళ్లింది. దాంతో, రికార్డు స్థాయిలో 10 సార్లు ఫైనల్ చేరిన జట్టుగా సీఎస్కే రికార్డు సృష్టించింది. అయితే.. ఏమాత్రం అంచనాలు లేని సీఎస్కే ఏకంగా టైటిల్ పోరులో నిలవడం వెనక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. దాంతో, మైదానంలో తెలివైన వ్యూహాలతో ప్రత్యర్థిని కట్టడి చేసిని ధోనీ వచ్చే సీజన్ కూడా ఆడతాడనే వార్తలు ఊపందుకున్నాయి. మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ చెపాక్లో ధోనీకి ఆఖరి మ్యాచ్ కాదని, ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఉన్నందున ధోనీ ఆడే అవకాశం ఉందని అతను అన్నాడు.
మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్ వ్యాఖ్యలపై ధోనీ కూడా స్పందించిన విషయం తెలిసిందే. ఐపీఎల్కు వీడ్కోలు విషయమై ఇప్పుడే ఏం చెప్పలేనని, నిర్ణయం తీసుకునేందుకు ఇంకో 8 – 9 నెలల సమయం ఉందని ఈ లెజెండరీ క్రికెటర్ తెలిపాడు. దాంతో, తాలా ధోనీ వచ్చే సీజన్ కూడా బరిలోకి దిగాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు.
Consistent run with the bat 👌🏻
Powerplay wickets 😎
Mini-Battle for the best catch 😃Final Calling: On the mic with @deepak_chahar9 & @Ruutu1331 post #CSK‘s win in #Qualifier1 👌🏻👌🏻 – By @28anand
Full Interview 🎥🔽 #TATAIPL | #GTvCSKhttps://t.co/P2QzyUwuvr pic.twitter.com/zePCIekzRO
— IndianPremierLeague (@IPL) May 24, 2023
సొంత గ్రౌండ్ చెపాక్ స్టేడియంలో జరిగిన క్వాలిఫైయర్ 1 గేమ్లో చెన్నై సూపర్ కింగ్స్ చెలరేగి ఆడింది. పదోసారి ఐపీఎల్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. అయితే.. ధోనీ సేన కొట్టింది మోస్తరు స్కోరే.. కానీ, 15 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)పై విజయం సాధించింది. ఛేజ్ మాస్టర్గా పేరొందిన డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ను 157 పరుగులకే ఆలౌట్ చేసింది. దాంతో, టోర్నీ ఆరంభ మ్యాచ్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ సీజన్లో సీఎస్కే సాధించిన అద్భుత విజయాల్లో ఇది ఒకటి. అవును.. 12 సార్లు చెన్నైని ప్లే ఆఫ్స్కు తీసుకెళ్లిన అతను క్వాలిఫైయర్ 1లో తన అనుభవాన్నంతా ఉపయోగించాడు. పెద్దగా అనుభవం లేని బౌలింగ్ దళంతో ఈ మిస్టర్ కూల్ పెద్ద మ్యాజిక్ చేశాడు. అనామకులను ఆయుధాలుగా ప్రయోగించి ఫలితం సాధించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(60 : 44 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించడంతో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో గత మ్యాచ్ సెంచరీ హీరో శుభ్మన్ గిల్(42), ఆల్రౌండర్ రషీద్ ఖాన్(30) మాత్రమే పోరాడారు. డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా విఫలయమ్యారు. సీఎస్కే స్పిన్నర్లు జడేజా, థీక్షణ చెలరేగడంతో గుజరాత్ 157 రన్స్కే ఆలౌటయ్యింది. హార్దిక్ పాండ్యా సేన ఫైనల్ బెర్తు కోసం ఎలిమినేటర్ విజేతతో మే 26న తలపడనుంది.
రుతురాజ్ గైక్వాడ్(60: 44 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్)