గాలె : శ్రీలంకతో సోమవారం ఆరంభమైన రెండో టెస్టులో ఐర్లాండ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీ తృటిలో సెంచరీ అవకాశం కోల్పోయాడు.
పాల్ స్టిర్లింగ్ (74 రిటైర్డ్హర్ట్), లోర్కాన్ టక్కర్ (78 నాటౌట్) కూడా అర్ధసెంచరీలు నమోదు చేశారు. ఆట నిలిపివేసే సమయానికి టక్కర్, కర్టిస్ కాంపర్(27నాటౌట్) ఆటలో కొనసాగుతున్నారు. ప్రభాత్ జయసూరియ 2, అసిత ఫెర్నాండొ, రమేశ్ మెండిస్ ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు.