భారత్తో జరుగుతున్న రెండో టీ20లో ఐర్లాండ్ జట్టు ధాటిగా ఆడుతోంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్.. దీపక్ హుడా (104), సంజూ శాంసన్ (77) అద్భుతంగా ఆడటంతో 225 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ కూడా ఇన్నింగ్స్ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (18 బంతుల్లో 40) చెలరేగాడు. అతనికి కెప్టెన్ ఆండీ బాల్బిర్నీ (25 నాటౌట్) మంచి సహకారం అందించాడు.
ఎంత మంది బౌలర్లు వచ్చినా ఎడాపెడా బౌండరీలు బాదిన స్టిర్లింగ్ను రవి బిష్ణోయి బుట్టలో వేసుకున్నాడు. అతను వేసిన ఆరో ఓవర్ నాలుగో బంతికి స్టిర్లింగ్ బౌల్డ్ అయ్యాడు. అంతకుముందు ఎల్బీడబ్ల్యూ కోసం భారత్ అప్పీల్ చేసింది. కానీ అంపైర్ స్పందించలేదు. రివ్యూ కోరినా ఫలితం లకపోయింది. ఆ తర్వాత భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన స్టిర్లింగ్ మిస్సవడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఐర్లాండ్ జట్టు పవర్ప్లే ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. అయితే ఆ మరుసటి ఓవర్లోనే డెలనీ (0)ని పాండ్యా రనౌట్ చేశాడు.