ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడిన సంజూ శాంసన్ (77) పెవిలియన్ చేరాడు. అడైర్ వేసిన 17వ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ బాదిన సంజూ.. ఆ తర్వాతి బంతిని కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే అడైర్ వేసిన యార్కర్.. శాంసన్ బ్యాట్ను మిస్ అయింది. దీంతో వికెట్లను కూల్చింది. దీంతో హుడాతో కలిసి అతను నెలకొల్పిన భారీ భాగస్వామ్యానికి తెరపడింది. వీళ్లిద్దరూ కలిసి 176 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత జట్టు 17 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 201 పరుగులతో నిలిచింది.