బయో బబుల్లోకి ఆటగాళ్లు
ముంబై: వచ్చే నెల 9 నుంచి జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ సందడి షురూ అయింది. భారత్, ఇంగ్లండ్ మధ్య సిరీస్లు ముగిసిన వెంటనే టోర్నీ కోసం ఆటగాళ్లు వారి ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన బయోబబుల్లోకి ప్రవేశిస్తున్నారు. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాళ్లు హార్దిక్, కృనాల్ పాండ్యా, సూర్యకుమార్ సోమవారం ముంబైలో జట్టుతో కలిశారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు పంత్, అశ్విన్, అక్షర్, వోక్స్ కూడా ముంబై చేరుకున్నారు. కాగా సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు జానీ బెయిర్స్టో సహా మరికొందరు ఆటగాళ్లు.. తమ మొదటి మ్యాచ్ జరుగనున్న చెన్నైలో అడుగుపెట్టారు. మిగిలిన ఫ్రాంచైజీల ప్లేయర్లు సైతం జట్లతో కలుస్తుండగా.. క్వారంటైన్ తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు. జాతీయ జట్లతో లేని కొందరు ఆటగాళ్లు ఇదివరకే బయోబబుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, అహ్మదాబాద్ వేదికలుగా జరుగనుంది. కరోనా నేపథ్యంలో బయోబబుల్ సహా మిగిలిన ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా బీసీసీఐ చర్యలు తీసుకుంటున్నది.
ఇవి కూడా చదవండి: