న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్ ఈ ఏడాది ఏప్రిల్ 9న ప్రారంభమై మే 30తో ముగుస్తుందని సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి శనివారం వెల్లడించారు. మార్చి 28న జరిగే మూడో వన్డేతో భారత్, ఇంగ్లండ్ మధ్య సిరీస్లు ముగియనున్నాయి. ఆ మ్యాచ్ అనంతరం సరిగ్గా 12 రోజుల తర్వాత ఐపీఎల్కు బీసీసీఐ ప్రణాళిక రచించింది. అయితే ఐపీఎల్ షెడ్యూల్, వేదికలకు వచ్చే వారం జరిగే పాలకమండలి సమావేశంలో ఆమోదముద్ర లభించనుందని ఆ అధికారి చెప్పారు. మరోవైపు చెన్నై, కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్లో ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ భావిస్తుండగా.. ముంబై విషయంలో సందిగ్ధత నెలకొంది. దీంతో హైదరాబాద్ కూడా పోటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.