న్యూఢిల్లీ: రానున్న ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 23న కొచ్చిలో వేలం నిర్వహించనున్నారు. తేదీని ముందుగానే నిర్ణయించినా, వేదికను బుధవారం ఖరారు చేశారు. కొచ్చితో పాటు ఇస్తాంబుల్, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాలు పోటీపడినా బీసీసీఐ కేరళ వైపే మొగ్గుచూపింది. తేదీలు, సౌకర్యాల పరంగా కొచ్చి అనుకూలంగా ఉండటంతో ఆ నగరానికే ప్రాధాన్యం ఇచ్చినట్టు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాదిలా కాకుండా ఈసారి మినీ వేలం నిర్వహించనున్నారు.