న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. సాధారణంగా ప్రతి ఏటా వేసవిలో ఐపీఎల్ నిర్వహిస్తుండగా.. ఈ సారి దేశ వ్యాప్తంగా సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ విడుదలపై తర్జన భర్జన కొనసాగుతున్నది. ‘వచ్చే నెల 22 నుంచి టోర్నీ ప్రారంభించాలనుకుంటున్నాం. అయితే పూర్తి స్థాయిలో కాకుండా.. తొలుత 15 రోజుల షెడ్యూల్ విడుదల చేయాలనుకుంటున్నాం.
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత దాన్ని గమనించి మిగిలిన మ్యాచ్లను ప్లాన్ చేస్తాం’ అని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ మంగళవారం పేర్కొన్నాడు. గతంలో సాధారణ ఎన్నికల సమయంలో లీగ్ను విదేశాల్లో నిర్వహించగా.. ఈసారి అలా కాకుండా ఎన్నికలతో ఇబ్బంది లేకుండా షెడ్యూ ల్ రూపొందించి.. దేశంలోనే మొత్తం లీగ్ నిర్వహించాలని ఐపీఎల్ పాలక మండలి భావిస్తున్నది.