IPL-2023 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2023 లీగ్కు ముందు పంజాబ్ కింగ్స్లో భారీ మార్పే జరిగింది. మయాంక్ అగర్వాల్ను కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించి.. శిఖర్ ధావర్ను ఫ్రాంచైజీ నియమించింది. వచ్చే సీజన్లో ధావన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ ఏడాదిలో పంజాబ్ జట్టు ప్రదర్శన యాజమాన్యాన్ని నిరాశ పరిచింది. అనేక సందర్భాల్లో జట్లు గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమి పాలైంది. అలాగే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సైతం బ్యాట్తో పెద్దగా రాణించలేకపోయాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి యాజమాన్యం తప్పించింది. బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది. మయాంక్ సారథ్యంలో పంజాబ్ జట్లు ప్లే ఆఫ్ దశకు చేరుకోలేకపోయింది. దీంతో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించబోతున్నట్లుగా వార్తలు రాగా.. ఈ క్రమంలో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకున్నది.
పీఎఎల్-2022 మెగా వేలానికి ముందు అంతకు ముందు కెప్టెన్గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరాడు. ఆ సీజన్లో మయాంక్ అగర్వాల్ పంజాబ్ బాధ్యతలు అప్పగించింది. అటు కెప్టెన్గా, బ్యాట్మెన్గా పరుగులు సాధించడంలోనూ విఫలమయ్యాడు. 16.33 సగటుతో 196 పరుగులు చేశాడు. గతేడాది ధావన్ను కెప్టెన్గా చేయాలని భావించినా.. చివరకు మయాంక్కే అవకాశం ఇచ్చింది యాజమాన్యం. తాజాగా వచ్చే సీజన్కు ధావన్ను కెప్టెన్గా నియమించాలని బోర్డు నిర్ణయించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మెగా వేలంలో ధావన్ను రూ.8.25కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. 14 మ్యాచ్లు ఆడిన ధావన్ 38.33 సగటు, 122.66 స్ట్రయిక్ రేట్తో 460 పరుగులు చేశాడు.
మయాంక్ అగర్వాల్ను కెప్టెన్సీ నుంచి తొలగించినా.. జట్టులో కొనసాగిస్తుందా? లేదా? అన్నది త్వరలో తేలనున్నది. ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అన్ని ఫ్రాంచైజీలకు నవంబర్ 15 వరకు సమయం ఉంది. ధావన్ ఐపీఎల్లో నిలకడగా రాణిస్తున్నాడు. అయితే భారత్ తరపున వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. ఇటీవలే వన్డేల్లో భారత్ బీ టీమ్కు ధావన్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ నెలాఖరులో న్యూజిలాండ్లో జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కూడా ధావన్ కెప్టెన్గా పని చేశాడు.
రాబోయే సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు కొత్త కెప్టెన్, కోచ్తో బరిలోకి దిగనున్నది. 2023 సీజన్కు ముందు పంజాబ్ ఫ్రాంచైజీ టీమ్ ప్రధాన కోచ్ను సైతం మార్చింది. అనిల్ కుంబ్లే స్థానంలో ట్రెవర్ బేలిస్ను హెడ్ కోచ్గా నియమించింది. అతని సారథ్యంలో ఇంగ్లండ్ జట్టు 2019 వన్డే ప్రపంచ కప్ను గెలుచుకుంది. ట్రెవర్ బేలిస్ 2012 – 2014లో కోల్కతా నైట్ రైడర్స్ను చాంపియన్గా నిలుపడంలో కృషి చేశాడు. బేలిస్తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన బ్రాడ్ హాడిన్ సైతం పంజాబ్ కోచింగ్ స్టాఫ్లో భాగం కానున్నాడు. పంజాబ్ జట్టు చివరిసారిగా 2014లో ప్లేఆఫ్లకు చేరుకుంది. ఆ తర్వాత జట్టు గత నాలుగు సీజన్లుగా ఆరో స్థానంలో నిలిచింది.