సన్రైజర్స్ యువపేసర్ ఉమ్రాన్ మాలిక్పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. అతను టీమిండియా మెటీరియల్ అని చెప్పాడు. మాలిక్ను టీమిండియా సెలెక్టర్లు గమనిస్తూ ఉండాలని, జాతీయ జట్టు బృందంలో చోటు కల్పించాలని సూచించాడు.
‘‘అతను నిలకడగా సత్తా చాటుతున్నాడు. తన యాటిడ్యూడ్ కూడా నాకు బాగా నచ్చింది. ఈ కుర్రాడు ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకుంటున్నాడు. మంచి పేస్ ఉంది. సరైన ప్రాంతాల్లో బంతులు వేస్తే చాలా మంది బ్యాటర్లను ఇబ్బందులు పెడతాడు’’ అని రవిశాస్త్రి చెప్పాడు. టీమిండియాకు అతన్ని దగ్గరగా ఉంచి, మాలిక్లో వచ్చే ప్రోగ్రెస్ను గమనిస్తూ ఉండాలని చెప్పాడు.
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో కూడా ఉమ్రాన్ మాలిక్ 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి అందరి దృష్టినీ ఆకర్షించాడు. గతేడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్లో ఏకంగా 153 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన మాలిక్ను.. సన్రైజర్స్ ఈ ఏడాది రిటైన్ చేసుకుంది.