ముంబై: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో క్రికెట్ పున:ప్రవేశానికి ఆమోదం లభించింది. ఎప్పుడెప్పుడు విశ్వక్రీడల్లో క్రికెట్ను చూస్తామా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఆశలు మరో ఐదేళ్లలో నెరవేరబోతున్నాయి. లాస్ ఏంజిల్స్ వేదికగా 2028లో జరిగే విశ్వక్రీడల్లో క్రికెట్ను భాగం చేసేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ఆమోదం తెలిపింది.
అక్టోబర్ 13న సమావేశమైన ఐవోసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు.. క్రికెట్తో పాటు సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోస్సె (సిక్సెస్), స్కాష్ను ఒలింపిక్స్లో భాగం చేయబోతున్నట్లు తెలిపింది. ఆ మేరకు ఆదివారం నుంచి ముంబైలో మొదలైన ఐవోసీ సెషన్స్లో ఈ ప్రతిపాదనను సభ్యుల ముందు ఉంచి ఓటింగ్ చేపట్టింది.
ఈ ఓటింగ్లో 2028 నుంచి ఒలింపిక్స్లో క్రికెట్ ప్రవేశం ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దాంతో లాస్ఏంజిల్స్ ఒలింపిక్స్లో పురుషుల, మహిళల క్రికెట్ జట్లు టీ20 ఫార్మాట్లో బరిలోకి దిగనున్నాయి. ఇన్నాళ్లు ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియాకప్ లాంటి వాటికి పరిమితమైన టీమిండియా ఇప్పుడు ఒలింపిక్స్లోనూ పోటీ పడనుంది.