న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కొత్త క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆ స్టేడియం ఉండబోతోంది. దానికి సంబంధించిన శంకుస్థాపన ఇవాళ జరుగుతోంది. రజతలాబ్లో ఉన్న గంజారి ప్రాంతంలోని సుమారు 30 ఎకరాల్లో ఆ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 450 కోట్లు పెట్టి ఆ స్టేడియాన్ని కడుతున్నారు. శివుడి ప్రేరణతో వారణాసి క్రికెట్ స్టేడియం నమోనా తయారు చేశారు.
శివుడి శిరస్సుపై ఉన్న నెలవంక రూపంలో స్టేడియం రూఫ్లను తయారు చేస్తున్నారు. ఇక ఫ్లడ్ లైట్లను త్రిశూలం ఆకారంలో రూపొందిస్తున్నారు. ఘాట్ల శైలిలో సీటింగ్ ఉంటుంది. మెటాలిక్ షీట్లను బిల్వపత్రం రూపంలో తీర్చిదిద్దుతున్నారు.
30 వేల మంది ప్రేక్షుల సామర్థ్యంతో స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 2025లోగా ఈ స్టేడియం పూర్తికానున్నది. యూపీలో కాన్పూర్, లక్నో తర్వాత ఇది మూడవ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కానున్నది.
PM @narendramodi will lay the foundation stone of the International Cricket Stadium in Varanasi today. The stadium lights will be like Trishul & the entry will be with Shivji Damru. pic.twitter.com/BTWGllZj6a
— DR.TEENA KAPOOR SHARMA (@Teenasharma_77) September 23, 2023