IND vs AUS : వైజాగ్లో జరుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా(Australia) బ్యాటర్లు దంచికొట్టారు. జోష్ ఇంగ్లిస్(110 : 50 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు) ఫాస్టెస్ట్ సెంచరీతో భారత యువ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్టీవ్ స్మిత్ (52) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. తొలి ఓవర్ నుంచి దంచుడే పనిగా పెట్టుకున్న కంగారూ ఆటగాళ్లు 19వ ఓవర్ దాకా అదే జోరు కొనసాగించారు. ఆఖర్లో టిమ్ డేవిడ్(19 నాటౌట్) ధనాధన్ ఆడి జట్టు స్కోర్ 200 దాటించాడు. భారత ఫీల్డర్ల వైఫల్యం కూడా ఆసీస్ పరుగుల ప్రవాహానికి తోడైంది.
The Josh Inglis show to kick things off after the World Cup
India faced with a huge total in the series opener – will they chase this? 🤔 #INDvAUS
LIVE: https://t.co/GTiGD3faCl pic.twitter.com/tJ5TTDN7Wa
— ESPNcricinfo (@ESPNcricinfo) November 23, 2023
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు మాథ్యూ షార్ట్(13), స్మిత్ శుభారంభం ఇచ్చారు. కానీ, యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన తొలిఓవర్లోనే షార్ట్ను బౌల్డ్ చేశాడు. దాంతో, మొదటి వికెట్కు 31 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కానీ, ఆ తర్వాత మొదలైంది ఇంగ్లిస్ విధ్వంసం. బిష్ణోయ్ను టార్గెట్ చేసిన ఇంగ్లిస్ అతడు వేసిన 12వ ఓవర్లో సిక్సర్తో హాఫ్ సెంచరీ సాధించాడు.
అనంతరం ప్రసిధ్, అక్షర్ పటేల్ బౌలింగ్ను ఉతికారేస్తూ శతకం సాధించాడు. టీ20ల్లో అతడికి ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. చివరకు ప్రసిధ్ ఓవర్లో ఇంగ్లిస్..భారీ షాట్ ఆడబోయి యశస్వీ చేతికి చిక్కాడు. అక్కడితో స్కోర్ కాసింత నెమ్మదించింది. భారత బౌరల్లలో ముఖేశ్ కుమార్ వికెట్ తీయకున్నా తక్కువ పరుగులిచ్చాడు.